నిజంనిప్పులాంటిది

Apr 25 2024, 08:44

నేడు తెలంగాణకు అమిత్ షా! సిద్దిపేట లొ భారీ బహిరంగ సభ

అగ్ర‌నేత అమిత్‌షా ఇవాళ తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌ను న్నారు. సిద్దిపేట‌లో నిర్వ‌ హించే బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న పాల్గొంటారు.

ఢిల్లీ నుంచి ఉదయం బయ లుదేరి బేగంపేట విమానాశ్ర యానికి చేరుకుంటారు అక్కడి నుంచి హెలికా ప్టర్‌లో సిద్దిపేటకు చేరు కుంటారు. డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ విజయ సంకల్ప బహిరంగ సభలో పాల్గొంటారు.

మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకి మద్ద తుగా అమిత్ షా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు సభ జరగనుంది.

ఆ తర్వాత 1.45 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని రెండున్నర గంటలపాటు అక్కడే ఉంటారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు.

సాయంత్రం 4.15 గంటలకు భువనేశ్వర్‌కు బయలుదేరు తారు. ఇక మరోవైపు రాష్ట్రంలో మే 13న పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో మే 4, 6, 8 తేదీల్లో ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన దాదాపుగా ఖరారైంది.

ఇక.. పార్టీ నేతలు, కార్యక ర్తల్లో జోష్‌ నింపేలా ప్రధాని మోడీ పర్యటన ఉంటుందని సమాచారం...

నిజంనిప్పులాంటిది

Apr 25 2024, 08:43

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అమ్మాయిల దే హవా

రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ వార్షిక ఫలితాలను బుధవా రం హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డులో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేశారు.

ఈ ఫలితాల్లో అమ్మాయిలే హవా కొనసాగించారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలోనూ వారే పైచేయి సాధించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్స రంలో 4,78,723 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 2,87,261 (60.01 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.

ఇందులో 2,41,682 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరుకాగా, 1,65,190 (68.35 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 2,37, 041,మంది అబ్బాయిలు పరీక్షలు రాస్తే, 1,22,071 (51.50 శాతం) మంది పాసయ్యారు.

అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు 16.85 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత సాధించారు.ఇంటర్‌ ప్రథమ సంవత్సరం జనరల్‌ విభా గంలో 4,30,413 మంది పరీక్షలు రాస్తే, 2,62,829 (61.06 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.

ఇందులో 2,17,716 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరుకాగా, 1,49,331 (68.59 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 2,12 ,697 మంది అబ్బాయిలు పరీక్షలు రాయగా, 1,13, 498,(53.36 శాతం) మంది పాసయ్యారు.

ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఒకేషనల్‌ విభాగంలో 48,310 మంది పరీక్ష రాస్తే, 24,432 (50.57 శాతం) మంది ఉత్తీర్ణత సాధిం చారు. ఇందులో 23,966 మంది అమ్మాయిలు పరీక్షలు రాయగా, 15,859 (66.17 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు.

24,344 మంది అబ్బాయి లు పరీక్షలు రాస్తే, 8,573 (35.21 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 5,02,280 మంది పరీక్షలకు హాజరుకాగా, 3,22,432 (64.19 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.

ఇందులో 2,47,358 మంది అమ్మాయిలు పరీక్షలు రాస్తే, 1,79,412 (72.53 శాతం) మంది ఉతీర్ణత పొందారు. 2,54,922 మంది అబ్బాయి లు పరీక్షలు రాయగా, 1,43,020 (56.10 శాతం) మంది పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలోనూ అబ్బా యిల కంటే అమ్మా యిలు 16.43 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత పొందారు.

ఇంటర్‌ ద్వితీయ సంవత్స రం జనరల్‌ విభాగంలో 4,01,445 మంది పరీక్షలకు హాజరుకాగా, 2,78,856 (69.46 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 2,05,381 మంది అమ్మా యిలు పరీక్షలు రాయగా, 1,55,500 (75.71 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. ఒకేష నల్‌ జనరల్‌ విభాగంలో 42,723 మంది పరీక్షలు రాస్తే, 27,287 (63.86 శాతం) మంది విద్యార్థులు పాసయ్యారు.

ఇందులో 21,853 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరు కాగా, 17,327 (79.28 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 20,870 మంది అబ్బాయిలు పరీక్షలు రాయగా, 9,960 (47.72 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.

ఈ కార్యక్రమంలో ఇంటర్‌ బోర్డు పరీక్షల నియంత్రణా ధికారి (సీవోఈ) జయప్రద బాయి, జాయింట్‌ సెక్రెటరీ వై శ్రీనివాస్‌, సీజీజీ డైరెక్టర్‌ జనరల్‌ రాజేంద్ర నిమ్జే తదితరులు పాల్గొన్నారు...

నిజంనిప్పులాంటిది

Apr 25 2024, 08:42

ఉత్తర ప్రదేశ్ లొ ఎన్నికల వేళ విషాదం..బీజేపీ ఎంపీ కన్నుమూత

ఉత్తరప్రదేశ్ లొ ఎన్నికల వేళ బీజేపీ ఎంపీ కన్నుమూ శారు. ఉత్తరప్రదేశ్ హత్రాస్ బీజేపీ ఎంపీ రాజ్ వీర్ దిలేర్ అలీగఢ్ లోని ఆస్పత్రిలో ఈరోజు ఉదయం మర ణించారు.

గత కొంతకాలంగా రాజ్ వీర దిలేర్ అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో హథ్రాస్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు.

కాగా ఈసారి ఎన్నికల్లోనూ అదే స్థానానికి పోటీ చేస్తు న్నారు రాజ్ వీర్ దిలేర్. ఆయన మృతితో స్థానిక కార్యకర్తలు దిగ్భ్రాంతి గురయ్యారు.

దిలేర్ 2017లో ఇగ్లాస్ నుంచి ఉత్తరప్రదేశ్ శాసన సభకు ఎన్నికయ్యారు. తర్వాత లోక్‌ సభకు ఎన్నికయ్యారు. దీంతో, ఎమ్మెల్యే పదవికి రాజీనా మా చేశారు. దిలేర్ మృతికి యూపీ సీఎం యోగి ఆది త్యనాథ్ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

రాజ్ వీర్ దిలేర్ అకాల మరణం చాలా బాధాకరం అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. బీజేపీకి, ఆయన కుటుంబానికి దిలేర్ మృతి తీరని లోటని సానుభూతి వ్యక్తం చేశారు.

నిజంనిప్పులాంటిది

Apr 25 2024, 08:41

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ఆగిఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో అందులో ఉన్న ఓ చిన్నారి తో సహా ఆరుగురు చనిపో యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ఆరు గురు ఘటనాస్థంలోనే చనిపోయారు. గాయపడిన ఇద్దరిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కారు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

నిజంనిప్పులాంటిది

Apr 25 2024, 08:40

క్రికెట్ అభిమానులకు మెట్రో యాజమాన్యం శుభవార్త

హైదరాబాద్ ప్రజలకు మెట్రో యాజమాన్యం శుభవార్త చెప్పింది. ఈరోజున ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఆ మార్గంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపింది.

అయితే, మిగతా మార్గాల లో మాత్రం సాధారణ మెట్రో వేళలు కొనసాగుతాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. పొడిగించిన మెట్రో సేవలు అర్ధరాత్రి ఒంటి వరకు అందుబాటు లో ఉంటాయని చెప్పారు.

ఉప్పల్ మార్గంలో లాస్ట్ ట్రైన్ అర్థరాత్రి 12.15 గంటలకు బయల్దేరి ఒంటి గంట 10 నిమిషాలకు గమ్యస్థానాన్ని చేరుకుం టుందని ఆయన పేర్కొ న్నారు.

ఆ సమయంలో.. ఉప్పల్, స్టేడియం, ఎన్జీఆర్ఐ స్టేషన్ల లో మాత్రమే ప్రయాణికు లను ప్రవేశానికి అనుమతి స్తున్నట్లు ప్రకటించారు. ఉప్పల్ మార్గంలోని మిగతా స్టేషన్లలో ట్రైన్ దిగే వారికే అనుమతి ఉంటుందని.. ఎక్కడానికి వీలుండదని స్పష్టం చేశారు.

మిగతా మార్గాల్లో మాత్రం డైలీ నడిచే నిర్ణిత వేళలలో మాత్రమే హైదరాబాద్ మెట్రో సేవలు కొనసాగు తాయన్నారు. ఇవాళ హైదరాబాద్ వేదికగా ఆర్సీబీ, సన్ రైజర్స్ కు మధ్య మ్యాచ్ ఉన్న విషయం తెలిసిందే...

నిజంనిప్పులాంటిది

Apr 25 2024, 08:39

ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ..

ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్ ను. నియ మిస్తూ ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

విజయవాడ సీపీగా పీహెచ్ రామకృష్ణను నియమిం చింది. రేపు ఉదయం లోపు బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది....

నిజంనిప్పులాంటిది

Apr 25 2024, 08:26

ఢిల్లీ తో పోరాడి ఓడిన గుజరాత్ టైటాన్స్

ఢిల్లీతో జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ పోరాడినా ఫ‌లితం లేక‌పోయింది. ఆఖ‌రి బంతికి అయిదు ప‌రుగులు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ ఉత్కంఠ పోరులో ఢిల్లీ నాలుగు ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

కాగా, అంత‌కుముందు భారీ లక్ష్య చేధనలో బరిలోకి దిగిన గుజరాత్‌ బ్యాటర్లు చెలరేగి ఆడారు. రెండో ఓవర్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (6) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన వృద్ధిమాన్‌ సాహా 39,తో కలిసి సాయి సుద ర్శన్ 50,దూకుడుగా ఆడాడు.

అయితే 10వ ఓవర్‌లో నాలుగో బంతికి సాహా ఔటయినప్పటికీ.. సాయి సుదర్శన్‌ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (1) వెంటనే ఔటయ్యాడు..

ఇలా మొత్తం ఎనిమిది వికెట్లు న‌ష్ట‌పోయిన గుజ‌ రాత్ విజ‌యం చేరువ‌లోకి వ‌చ్చి ఓట‌మిచెందింది...

నిజంనిప్పులాంటిది

Apr 24 2024, 21:23

కేసీఆర్ కాన్వాయ్ కి రోడ్డు ప్రమాదం?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎన్నికల సందర్భంగా ఈరోజు బస్సు యాత్ర ప్రారంభించిన విషయం పాఠకులకు తెలిసిందే.

నేడు ఆయన నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి యాత్ర ప్రారంభించారు. వేములపల్లి శివారులో కేసీఆర్ కాన్వాయ్ కు ప్రమాదం జరిగింది.

ఒకదాని కొకటి 10 వాహ నాలు వరుసగా ఢీకొన్నా యి. దీంతో పలువురికి గాయలైనట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

నిజంనిప్పులాంటిది

Apr 24 2024, 21:22

తెలంగాణ జిల్లాలలో కొనసాగుతున్న మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర

తెలంగాణ భ‌వ‌న్ నుంచి పోరుయాత్ర‌కు కేసీఆర్ బుధవారం శ్రీకారం చుట్టారు.

భ‌వ‌న్‌కు చేరుకున్న కేసీ ఆర్‌కు మ‌హిళ‌లు మంగ‌ళ‌ హారతుల‌తో ఘ‌నస్వాగ‌తం ప‌లికారు. మొద‌ట‌ భ‌వ‌న్ ప్రాంగ‌ణంలోని తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి పూల‌మాల వేశారు.

కేసీఆర్. అనంత‌రం కేసీఆర్ బ‌స్సు యాత్ర ప్రారంభ‌మైం ది. ఈ సంద‌ర్భంగా పార్టీ శ్రేణుల‌కు కేసీఆర్ అభివాదం చేశారు. బాణాసంచా కాల్చి బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు సంబురాలు చేసుకున్నారు.

నేటి నుంచి 17 రోజుల పాటు సాగే ఈ యాత్ర కొన‌సాగ‌నుంది. మే నెల 10 వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. మిర్యాల గూడలో ప్రారంభమై సిద్దిపే టలో జరిగే బహిరంగసభతో ఈ యాత్ర ముగుస్తుంది.

నిజంనిప్పులాంటిది

Apr 24 2024, 20:30

రేపు నామినేషన్ వేయనున్న ఏపీ సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఏప్రిల్ 25 తన సొంత నియోజక వర్గం పులివెందులలో నామినేషన్ వేయనున్నారు.

నామినేషన్ కు ముందు సీఎం జగన్ పులివెందులలో ఏర్పాటు చేసిన సభకు హాజ రవుతారు.

అనంతరం పులివెందుల వైఎస్సార్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ లోని ఆర్వో కార్యా లయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు...